టీ20 డబ్ల్యూసీ-2026 ఫైనల్‌‌కు చేరేది ఆ జట్లే.. ఆసీస్ మాజీ కెప్టెన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

టీ20 డబ్ల్యూసీ-2026 ఫైనల్‌‌కు చేరేది ఆ జట్లే.. ఆసీస్ మాజీ కెప్టెన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Last updated by: Rayhaan Shareef

Last updated at: Jan 23, 2026, 12:06 PM

స్పోర్ట్స్ డెస్క్: క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న టీ20 ప్రపంచకప్(T20 World Cup 2026) టోర్నీ మరో రెండు వారాల్లో ప్రారంభం కానుంది. ఈ సారి ఏ జట్టు టైటిల్ గెలుస్తుందోనని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక గ్రూప్‌-ఎ నుంచి డిఫెండింగ్‌ ఛాంపియన్‌ భారత్‌, పాకిస్థాన్, అమెరికా, నమీబియా, నెదర్లాండ్స్‌ జట్లు పోటీపడుతున్నాయి. చిరకాల ప్రత్యర్థులు భారత్‌ - పాకిస్థాన్‌ ఈసారి కూడా ఒకే గ్రూపులో ఉండటం క్రికెట్‌ ప్రేమికులను ఆకర్షిస్తోంది. ఈ రెండు దేశాల మధ్య కొలంబో వేదికగా ఫిబ్రవరి 15న మ్యాచ్‌ జరగనుంది. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్‌ మైకేల్‌ క్లార్క్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.