
కంగనా వ్యాఖ్యలపై విశాల్ దద్లానీ ఫైర్ విద్యార్థులపై కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలను సంగీత దర్శకుడు విశాల్ దద్లానీ తీవ్రంగా ఖండించారు.సోషల్ మీడియాలో ఆమె వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు. విద్యార్థుల నిరసనల సమయంలో జరిగిన హింసాత్మక ఘటనలను గుర్తు చేశారు. కంగనా వైఖరిని తీవ్రంగా తప్పుబట్టారు.

బీహార్ పేపర్ లీక్ కేసులో డాక్టర్ అరెస్ట్ బీహార్ టీచర్ రిక్రూట్మెంట్ పరీక్ష పేపర్ లీక్ కేసులో డాక్టర్ మనీశ్ కుమార్ను అధికారులు అరెస్ట్ చేశారు.పరీక్షకు ముందే 30 మంది అభ్యర్థులకు ప్రశ్నాపత్రాలు అందించినట్లు దర్యాప్తులో తేలింది.దీని కోసం సుమారు రూ.1.2 కోట్లు వసూలు చేసినట్లు అధికారులు వెల్లడించారు.ఆర్థిక నేరాల విభాగం కేసు దర్యాప్తును వేగవంతం చేసింది.

తమిళనాడు ప్రభుత్వానికి హైకోర్టు షాక్ కరూర్ తొక్కిసలాట బాధిత కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వాలన్న తమిళనాడు ప్రభుత్వ నిర్ణయాన్ని మద్రాస్ హైకోర్టు రద్దు చేసింది.ప్రభుత్వ ఉద్యోగాలు రాజ్యాంగ నిబంధనల ప్రకారమే భర్తీ చేయాలని కోర్టు స్పష్టం చేసింది.అర్హత, నైపుణ్యం ఆధారంగానే నియామకాలు జరగాలని పేర్కొంది. తాత్కాలిక నియామక ఉత్తర్వులను కోర్టు కొట్టివేసింది.

నీట్ వివాదం: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా నీట్ పేపర్ లీక్ వివాదంతో దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్న వేళ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. తన లేఖను ప్రధాని మోదీకి పంపిన ఆయన, యువత ఆకాంక్షలను గౌరవిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. సీబీఐ విచారణ, రీ-ఎగ్జామ్ నిర్వహించినా నైతిక బాధ్యతతో పదవికి వీడ్కోలు పలుకుతున్నానని పేర్కొన్నారు.

ఫిడే తాత్కాలిక అధ్యక్షుడిగా విశ్వనాథన్ ఆనంద్ భారత చెస్ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్కు అరుదైన గౌరవం దక్కింది. ఆయనను అంతర్జాతీయ చెస్ సమాఖ్య (ఫిడే) తాత్కాలిక అధ్యక్షుడిగా నియమించింది. ప్రస్తుత అధ్యక్షుడిపై ఈయూ ఆంక్షల నేపథ్యంలో ఆనంద్కు ఈ బాధ్యతలు అప్పగించారు. ఈ విషయాన్ని ఫిడే అధికారికంగా ప్రకటించింది.

టెక్ మహీంద్రాపై మహిళా ఉద్యోగిని ఆందోళన తీవ్ర అనారోగ్య పరిస్థితుల్లోనూ వేధించి ఉద్యోగం నుంచి తొలగించారని ఓ మహిళా సాఫ్ట్వేర్ ఉద్యోగిని టెక్ మహీంద్రాపై ఆరోపించారు.కంపెనీ యాజమాన్యంపై పోలీసులకు ఫిర్యాదు చేసిన ఆమె, టెక్ మహీంద్రా కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు.ఈ ఘటన దుండిగల్ పరిధిలో వెలుగుచూసింది.

18 బంతుల్లో వైభవ్ హాఫ్ సెంచరీ జింబాబ్వేతో తొలి టీ20లో టీమ్ ఇండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ మెరుపులు మెరిపించాడు. ట్రేడ్మార్క్ షాట్లతో కేవలం 18 బంతుల్లోనే తొలి అంతర్జాతీయ హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. 277.78 స్ట్రైక్రేట్తో 18 బంతుల్లో 50 పరుగులు (4 ఫోర్లు, 4 సిక్సర్లు) చేసి, 19వ బంతికే ఔటయ్యాడు.

డ్రైవింగ్ టెస్ట్లో ప్రమాదం.. ముగ్గురికి గాయాలు తెనాలిలో డ్రైవింగ్ టెస్ట్ సందర్భంగా ఓ యువతి బ్రేక్కు బదులుగా యాక్సిలేటర్ తొక్కడంతో ప్రమాదం జరిగింది.ఈ ఘటనలో ముగ్గురు గాయపడ్డారు.డ్రైవింగ్ లైసెన్స్ కోసం నిర్వహించిన పరీక్షల్లో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.గాయపడిన వారికి చికిత్స అందిస్తున్నారు.

విద్యుత్ కోతలపై రైతుల రాస్తారోకో నల్లగొండ జిల్లా ఇండ్లూరులో విద్యుత్ కోతలకు నిరసనగా రైతులు రాస్తారోకో చేపట్టారు. అసమయ విద్యుత్ కోతలతో నారుమడ్లు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి కోమటిరెడ్డి జోక్యం చేసుకుని సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేశారు. రోజుకు 17 గంటల విద్యుత్ ఇస్తున్నామని, సాంకేతిక సమస్యల సమయంలో మాత్రమే కోతలు ఉంటాయని ఏఈ తెలిపారు.

నిధుల కొరతతో ఎస్ఎన్డీపీ పనులు నత్తనడకన హైదరాబాద్లో వరద ముప్పు నివారణకు చేపట్టిన ఎస్ఎన్డీపీ పనులు నిధుల కొరతతో మందగించాయి. వర్షాలు కురుస్తున్నప్పటికీ నాలాల అభివృద్ధి పనులు ముందుకు సాగడం లేదని తెలుస్తోంది. పాలకుల నిర్లక్ష్యం కారణంగా ప్రాజెక్టు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోందనే విమర్శలు వినిపిస్తున్నాయి.

బీఆర్ఎస్ యువ సంగ్రామ సదస్సుపై వివాదం యువ సంగ్రామ సదస్సుకు ప్రభుత్వం అనుమతులు ఇవ్వకుండా అడ్డుకుంటోందని బీఆర్ఎస్ ఆరోపించింది.రేపు సరూర్నగర్లో జరిగే సభకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని తెలిపింది. సభను అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారని పార్టీ నేతలు విమర్శించారు. యూత్ డిక్లరేషన్పై కాంగ్రెస్ను నిలదీయడానికే ఈ సదస్సు నిర్వహిస్తున్నామని వెల్లడించారు.

ట్రంప్ ఆరోపణలను ఖండించిన చైనా 2020 అమెరికా ఎన్నికల్లో జోక్యం చేసుకున్నామన్న ట్రంప్ ఆరోపణలను చైనా తోసిపుచ్చింది. ఆ ఆరోపణలు నిరాధారమైనవని చైనా విదేశాంగ శాఖ పేర్కొంది. అమెరికా ఎన్నికల్లో తాము ఎప్పుడూ జోక్యం చేసుకోలేదని స్పష్టం చేసింది. తప్పుడు ఆరోపణలతో చైనాను అప్రతిష్టపాలు చేయాలని అమెరికా ప్రయత్నిస్తోందని విమర్శించింది.

దేశ తొలి హైడ్రోజన్ రైలుకు మోదీ జెండా ఊపు దేశంలోనే తొలి హైడ్రోజన్ పవర్డ్ రైలును ప్రధాని నరేంద్ర మోదీ హర్యానాలో ప్రారంభించారు. ఈ రైలు జింద్–సోనిపట్ మధ్య 89 కిలోమీటర్ల మేర నడవనుంది. పర్యావరణ పరిరక్షణలో ఇది చారిత్రాత్మక ముందడుగని మోదీ అన్నారు. స్వదేశీ సాంకేతికతతో తయారైన ఈ రైలు దేశ ఇంజినీరింగ్ సామర్థ్యానికి నిదర్శనమని ప్రశంసించారు.

మాజీ మంత్రి అంబటి రాంబాబుపై కేసు నమోదు ముద్రగడ పద్మనాభం అంత్యక్రియల సందర్భంగా గార్డ్ ఆఫ్ ఆనర్కు ఆటంకం కలిగించారనే ఆరోపణలతో మాజీ మంత్రి అంబటి రాంబాబుపై కిర్లంపూడి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. పోలీసు అధికారుల ఫిర్యాదు మేరకు ఆయనతో పాటు అనుచరులపై కూడా కేసు నమోదు చేశారు.

తెలంగాణకు వర్ష సూచన.. అల్పపీడన ప్రభావం ఒడిశా సమీపంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తెలంగాణలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. తూర్పు, పశ్చిమ దక్షిణ తెలంగాణలో సాయంత్రం నుంచి రాత్రి వరకు అక్కడక్కడ చినుకులు పడే అవకాశం ఉందని వెల్లడించింది.