
పవన్ కళ్యాణ్పై కవిత ఫైర్ బీఆర్ఎస్ నేత K. కవిత పవన్ కళ్యాణ్పై విమర్శలు చేశారు. హైదరాబాద్లోని 10 ఎకరాల శిఖం భూమిని తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ, "మీ కార్లు, భూముల్లో మా బిడ్డల సొమ్ముంది" అని వ్యాఖ్యానించారు. ప్రభుత్వ భూములను ప్రైవేట్ సంస్థలకు కట్టబెడుతున్నారని ఆరోపించారు.

జంతర్ మంతర్లో కాక్రోచ్ జనతా పార్టీ నిరసనలు ఢిల్లీలోనిజంతర్మంతర్ వద్ద CJP నిర్వహిస్తున్న నిరసనలకు పోలీసులు అనుమతి ఇచ్చారు. వేలాది మంది విద్యార్థులు అక్కడికి చేరుకోగా, CJP వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే సహా పార్టీ నేతలు ధర్నాలో పాల్గొన్నారు. NEET పేపర్ లీక్ వ్యవహారంపై కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ నినాదాలతో ఆ ప్రాంతం మార్మోగుతోంది.

హైడ్రా భారీ ఆపరేషన్.. ₹30 వేల కోట్ల భూమికి రక్షణ పర్యావరణ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్లోని పుప్పాలగూడలో ప్రాంతంలో హైడ్రా భారీ చర్యలు చేపట్టింది. ఆక్రమణలకు గురికాకుండా 200 ఎకరాల ప్రభుత్వ భూమికి ఫెన్సింగ్ ఏర్పాటు చేసింది. సహజ వారసత్వ సంపదను పరిరక్షించేందుకు తీసుకున్న ఈ చర్యలను పర్యావరణవేత్తలు స్వాగతిస్తున్నారు. కాగా ఈ భూమి విలువ సుమారు ₹30 వేల కోట్ల వరకు ఉంటుందని హైడ్రా వెల్లడించింది.

ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) వీగన్ ఆహార ఉత్పత్తులను సులభంగా గుర్తించేందుకు కొత్త వీగన్ లోగోను ప్రవేశపెట్టింది. ఆమోదం పొందిన అన్ని వీగన్ ఉత్పత్తుల ప్యాకేజీలపై ఈ లోగో తప్పనిసరిగా ఉండాలని తెలిపింది. 2027 జులై 1 నుంచి అమల్లోకి రానున్న ఈ నిబంధన వినియోగదారుల విశ్వాసం, పారదర్శకతను పెంచడమే లక్ష్యంగా తీసుకొచ్చినట్లు పేర్కొంది

బ్లాక్స్టోన్, కెనడా పెన్షన్ ప్లాన్ ఇన్వెస్ట్మెంట్ బోర్డు మద్దతుతో ఉన్న ఎయిర్ట్రంక్ భారత్లో డేటా సెంటర్ల అభివృద్ధికి 30 బిలియన్ డాలర్లు (సుమారు రూ.3 లక్షల కోట్లు) పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించింది. 2030 నాటికి 5 గిగావాట్ల సామర్థ్యంతో డేటా సెంటర్లు ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ పెట్టుబడితో వేలాది ఉద్యోగాలు సృష్టి కావడంతో పాటు భారత్ గ్లోబల్ ఏఐ హబ్గా ఎదగనుంది.

తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు K. అన్నామలై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2020లో బీజేపీలో చేరకముందు, సూపర్ స్టార్ రజినీకాంత్ తన నేతృత్వంలోని రాజకీయ ఉద్యమంలో చేరాలని ఫోన్ చేసి ఆహ్వానించారని వెల్లడించారు. అయితే అప్పటికే బీజేపీ నేత B. L. సంతోష్కు మాట ఇవ్వడంతో ఆ ఆఫర్ను తిరస్కరించినట్లు చెప్పారు. కాగా రజినీకాంత్ 2017లో ‘రజినీ మక్కల్ మండ్రం' స్థాపించగా, 2021లో దాన్ని అభిమాన సంఘంగా మార్చారు.

పాలమూరు సాగునీటి ప్రాజెక్టుల పనులను వేగవంతం చేసే లక్ష్యంతో సీఎం రేవంత్ రెడ్డి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో పర్యటిస్తున్నారు. మక్తల్-నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకం పనులను పరిశీలించి అధికారులతో సమీక్ష నిర్వహించారు. గురు, శుక్రవారాల్లో పాలమూరు-రంగారెడ్డి, కల్వకుర్తి, జూరాల, నెట్టెంపాడు ప్రాజెక్టులను సందర్శించి పురోగతిని సమీక్షించనున్నారు.

‘పెద్ది’ బ్లాక్బస్టర్ విజయంపై మెగాస్టార్ చిరంజీవి ఎక్స్ వేదికగా స్పందించారు. గత రెండేళ్లుగా ఈ సినిమా కోసం రామ్ చరణ్ పడిన కష్టం, అంకితభావమే విజయానికి కారణమని తెలిపారు. “ప్రేక్షకుల ప్రేమ చూస్తుంటే తండ్రిగా మాత్రమే కాదు, నటుడిగా కూడా గర్వంగా ఉంది. చరణ్ కృషికి దక్కిన ప్రతిఫలమే ఈ విజయం” అని పేర్కొన్నారు. చిత్రబృందం మొత్తానికి ఆయన అభినందనలు తెలిపారు.

అమీర్పేటలోని ఓ షాపింగ్ కాంప్లెక్స్లో గురువారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. రెండో అంతస్తులోని ఎంఎస్ఆర్ ఫ్యాషన్స్ దుకాణంలో చెలరేగిన మంటలు ఇతర షాపులకు వ్యాపించాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసే ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. భద్రతా చర్యల్లో భాగంగా దుకాణాలను ఖాళీ చేయించారు. ఘటనతో ప్రధాన రహదారిపై తీవ్ర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.

ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తైన సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. 2024 జూన్ 4 రాష్ట్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచే రోజు అని పేర్కొన్నారు. ప్రజలు ఇచ్చిన తీర్పు అధికారం కోసం కాదని, రాష్ట్ర పునర్నిర్మాణ బాధ్యత అని అన్నారు. సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనతో ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టేలా పాలన కొనసాగిస్తున్నామని తెలిపారు.

భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి తొడ కండరాల గాయంతో అఫ్గానిస్థాన్తో జరగనున్న మూడు వన్డేల సిరీస్కు దూరమయ్యే అవకాశం ఉంది. జూన్ 13 నుంచి 20 వరకు ఈ సిరీస్ జరగనుంది. ఇటీవల ఐపీఎల్ ఫైనల్లో ఆర్సీబీ విజయంలో కీలక పాత్ర పోషించిన కోహ్లి, మ్యాచ్ సందర్భంగా నొప్పితో ఇబ్బంది పడ్డాడు. ఫిజియో సహాయంతో చివరివరకు బ్యాటింగ్ చేసి జట్టుకు విజయాన్ని అందించాడు. ప్రస్తుతం అతని ఫిట్నెస్పై బీసీసీఐ పర్యవేక్షిస్తోంది.

కువైట్ విమానాశ్రయంపై దాడి..భారతీయుడి మృతి ఇరాన్ డ్రోన్ దాడిలో కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఓ భారతీయుడు మృతి చెందాడు. ఈ ఘటనలో 63 మంది గాయపడగా, మృతుడి కుటుంబానికి సహాయం అందిస్తున్నట్లు భారత రాయబార కార్యాలయం తెలిపింది. దాడితో ఎయిర్పోర్టు తీవ్రంగా దెబ్బతినడంతో విమానాల రాకపోకలు నిలిపివేశారు. పలు విమానాలను ఇతర ప్రాంతాలకు మళ్లించగా, ఇండిగో కూడా కువైట్ సర్వీసులను తాత్కాలికంగా రద్దు చేసింది.

సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఆన్లైన్ బెట్టింగ్ నైపుణ్యానికి సంబంధించిన ఆటగా పరిగణించినా, దానికి రాజ్యాంగ పరిరక్షణ ఉండదని స్పష్టం చేసింది. వివిధ క్రీడలపై ఆన్లైన్ బెట్టింగ్ను నిషేధిస్తూ తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలు తీసుకొచ్చిన చట్టాల రాజ్యాంగబద్ధతను సుప్రీంకోర్టు సమర్థించింది. దీంతో ఆన్లైన్ బెట్టింగ్ నియంత్రణకు రాష్ట్రాలకు అధికారం ఉందని మరోసారి స్పష్టమైంది.

సరిహద్దు వివాదంపై నేపాల్లో రాజకీయ దుమారం నేపాల్ ప్రధాని బాలేన్ షా పార్లమెంట్లో చేసిన వ్యాఖ్యలు దేశంలో తీవ్ర చర్చకు దారితీశాయి. భారత్తో సరిహద్దు వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో, కాలాపానీ , లిపులేఖ్ , లింపియాధురా ప్రాంతాల అంశంలో భారత్తో పాటు నేపాల్ కూడా కొన్ని చోట్ల ఆక్రమణలకు పాల్పడిందని ఆయన అంగీకరించినట్లు వార్తలు వచ్చాయి. ఈ వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి.

కార్ల్సన్పై ప్రజ్ఞానంద మరో సంచలనం భారత యువ గ్రాండ్మాస్టర్ ఆర్ ప్రజ్ఞానంద మరోసారి ప్రపంచ నంబర్-1 చెస్ ఆటగాడు మ్యాగ్నస్ కార్ల్సన్ను ఓడించాడు. నార్వే చెస్ టోర్నీలో క్లాసికల్ గేమ్లో కార్ల్సన్పై అద్భుత విజయం సాధించి వరుసగా రెండోసారి షాక్ ఇచ్చాడు. ఈ విజయంతో ప్రజ్ఞానంద తన అద్భుత ఫామ్ను మరోసారి నిరూపించాడు.