
ఇది మా కాంబోస్ గ్యాంగ్ స్టైల్
కొన్ని ప్రయాణాలు ప్లాన్తో ఉంటాయి… కానీ కొన్ని ప్రయాణాలు మనుషుల వల్లే స్పెషల్ అవుతాయి. పొటుగల్ ట్రిప్ అచ్చంగా అలాంటిదే. ఉదయం తొందరగా బయలుదేరి, కాస్త నిద్ర మత్తు, కాస్త ఆకలి, ఇంకా చాలా నవ్వులతో మా ప్రయాణం మొదలైంది. గమ్యం ఒక్కటే అయినా, మధ్యలో వచ్చిన సరదా మాటలు, జోకులు, పాత జ్ఞాపకాల రీప్లే—all included 😄 పొటుగల్ చేరుకున్నాక, ముందుగా కనిపించిన చిన్న బ్రేక్ఫాస్ట్ స్టాల్ దగ్గరే మా కాంబోస్ గ్యాంగ్ ఆగిపోయింది. పెద్ద హోటల్ కాదు, ఫ్యాన్సీ సెటప్ లేదు… కానీ ఆ ఇడ్లీ, దోసె, టీ రుచికి తోడు స్నేహం ఉండడంతో అది ఫైవ్స్టార్ అనిపించింది ☕🥞 ఆ స్టాల్ దగ్గర తీసుకున్న ఫోటో… అది కేవలం ఒక పిక్ కాదు. అది— ➡️ ఉదయపు తాజా గాలి ➡️ ఆకలితో వచ్చిన అసహనం ➡️ ఫుడ్ వచ్చాక వచ్చిన సంతోషం ➡️ ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు వచ్చే నిర్లిప్తమైన ఆనందం అన్నీ కలిసి నిలిచిపోయిన క్షణం. కాంబోస్ అంటే పేరుకే కాదు… భోజనంలో కాంబో, నవ్వుల్లో కాంబో, ట్రిప్లో కాంబో. ఎక్కడికెళ్లినా కలిసి, ఎలా ఉన్నా కలిసి—that’s our rule 😌 పొటుగల్ ట్రిప్ ఇంకా కొనసాగింది… కానీ ఆ బ్రేక్ఫాస్ట్ స్టాల్ దగ్గర మొదలైన రోజు, మా అందరికీ గుర్తుండిపోయే ఒక జ్ఞాపకంగా మారింది. ఇలాంటి క్షణాలే ఫ్రెండ్షిప్కి అసలు అర్థం ❤️ ఇలాంటి ఫోటోలే కాలంతో పాటు విలువ పెంచుకుంటాయి. కాంబోస్ – ఒక గ్యాంగ్ కాదు, ఒక ఫీలింగ్.

2025లో ఎన్నో సంఘనలు , జరిగిన గొప్ప వేడుకలు.. వెంటాడిన విషాదాలు
2025 సంవత్సరంలో ఎన్నో సంఘనలు చూశాం. వీటిలో విషాదాలు కొన్ని, విచిత్రాలు కొన్ని ఉంటే.. సంతోష సమయాలు, ఆనంద సంఘటనలు కూడా అనేకం ఉన్నాయి. అలాగే ఎన్నో మతపరమైన కార్యకలాపాలు, ప్రధాన పండుగలు, అరుదైన ఖగోళ సంఘటనలు, దేశవ్యాప్తంగా తీవ్ర చర్చలకు దారితీసిన అనేకం ఉన్నాయి. పెద్ద తీర్థయాత్రల నుండి ముఖ్యమైన ఆధ్యాత్మిక వేడుకల వరకు సంవత్సరంలో అత్యంత ముఖ్యమైన 12 మతపరమైన సంఘటనలు ఇక్కడ ఉన్నాయి. జాతీయంగా, అంతర్జాతీయంగా మతం గురించి చర్చలు తారాస్థాయికి చేరుకున్నాయి. గత సంవత్సరం జరిగిన ప్రధాన మతపరమైన అలాంటి సంఘటనలేవో ఇక్కడ చూద్దాం. 1. ప్రపంచ రామాయణ సమావేశం (జబల్పూర్, జనవరి 2-4): రాముని ఆదర్శాలు, రామాయణ సందేశంపై దృష్టి సారించి జనవరిలో జబల్పూర్లో ప్రపంచ రామాయణ సమావేశం నాల్గవ ఎడిషన్ జరిగింది. 2. మహాకుంభమేళా, తొక్కిసలాట: 2025 జనవరి 13 నుండి ఫిబ్రవరి 26 వరకు ప్రయాగ్రాజ్లో జరిగిన కుంభమేళాలో 660 మిలియన్ల మంది స్నానం చేశారు. ఈ సమయంలో జనవరి 29వ తేదీ బుధవారం మౌని అమావాస్య సందర్భంగా సంగం నది ఒడ్డున తొక్కిసలాట జరిగింది. సంగం వద్ద స్నానాలకు వెళ్లేవారి గుంపు గుమిగూడడంతో తొక్కిసలాట జరిగింది. బ్రహ్మ బేల (ఉదయం) కోసం వేచి ఉన్న ముప్పై ఏడు మంది భక్తులు ప్రాణాలు కోల్పోగా, మరో 60 మంది గాయపడ్డారు. 3. ఢిల్లీ తొక్కిసలాట: ఆ తరువాత 2025 ఫిబ్రవరి 15న, రాత్రి 9:26 గంటల ప్రాంతంలో ఢిల్లీ రైల్వే స్టేషన్లో జరిగిన తొక్కిసలాటలో కుంభమేళాకు వెళుతున్న 18 మంది మరణించారు. వీరిలో 14 మంది మహిళలు, ముగ్గురు పిల్లలు ఉన్నారు. ప్రయాగ్ మహాకుంభమేళాకు యాత్రికులను తీసుకెళ్తున్న SUV వాహనం ప్రయాగ్రాజ్లో బస్సును ఢీకొట్టడంతో అందులో ఉన్న 10 మంది మరణించారు. 4. ఖగోళ సంఘటనలు: 2025 సంవత్సరంలో మొత్తం నాలుగు గ్రహణాలు సంభవించాయి. మార్చి 14, సెప్టెంబర్ 7 తేదీలలో చంద్రగ్రహణం. మార్చి 29, సెప్టెంబర్ 21 తేదీలలో సూర్యగ్రహణం. దీనితో పాటు అంతరిక్షంలో అరుదైన గ్రహాల కవాతు కూడా కనిపించింది. సూర్యుని చుట్టూ తిరుగుతున్నప్పుడు 7 గ్రహాలు ఒకే సరళ రేఖలో వచ్చాయి. ఈ దృశ్యం జనవరి 21 రాత్రి నుండి జనవరి 25, 2025 వరకు కనిపించింది. దీనిని అంతరిక్షంలో గ్రహాల మహాకుంభ్ అని కూడా పిలుస్తారు. దీని తరువాత, ఈ దృశ్యం ఫిబ్రవరి 28న కనిపించింది. తరువాత ఈ కవాతు మార్చి 8న ముగిసింది. ఈ అరుదైన దృశ్యం 396 బిలియన్ సంవత్సరాల తర్వాత కనిపిస్తుందని చెబుతున్నారు. 5. జగన్నాథ ఆలయ సంఘటన: ఏప్రిల్ 2025లో పూరీలోని జగన్నాథ ఆలయంలో ఒక విచిత్రమైన, దిగ్భ్రాంతికరమైన సంఘటన జరిగింది. ఏప్రిల్ 14న ఒక పక్షి ఆలయం పైన ఉన్న ధర్మ ధ్వజం వాలింది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. భక్తులలో భయాందోళనలు రేకెత్తించింది. స్థానికులు, జ్యోతిష్కులు దీనిని దురదృష్టకర శకునంగా, భవిష్యత్ విపత్తుకు సంకేతంగా భావించారు. జూన్ 14న పంచ శాఖలలో ఒకరైన సెయింట్ అచ్యుతానంద మహారాజ్ పీఠం సమీపంలో మంటలు చెలరేగాయి. ఆలయం ఉత్తర ద్వారం వద్ద అకస్మాత్తుగా పెద్ద పక్షుల గుంపు కనిపించింది. ఇది అసాధారణ సంఘటన. దీని తరువాత స్నాన పూర్ణిమ రోజున ఆలయ సీనియర్ సేవక్ (కుక్) జగన్నాథ దీక్షిత్ విషాదకరమైన హత్య జరిగింది. దీని తరువాత పహల్గామ్ ఉగ్రవాద దాడి, తరువాత ఆపరేషన్ సిందూర్, అహ్మదాబాద్ విమాన ప్రమాదం జరిగింది. 6. పహల్గామ్ ఉగ్రవాద దాడి: 2025 ఏప్రిల్ 22న కాశ్మీర్లోని పహల్గామ్లోని బైసరన్ లోయలో 26 మంది పర్యాటకులను పాకిస్తాన్ ఉగ్రవాదులు కాల్చి చంపారు. వారి మతాన్ని ప్రశ్నించినందుకు. ఉగ్రవాదులు ప్రధానంగా హిందూ పర్యాటకులను లక్ష్యంగా చేసుకున్నారు. అయితే ఇండోర్కు చెందిన ఒక క్రైస్తవ పర్యాటకుడు కూడా ఇందులో పాల్గొన్నాడు. ఇతరులను రక్షించే ప్రయత్నంలో ఒక స్థానిక ముస్లిం మరణించాడు. దీని తరువాత, భారతదేశం ఆపరేషన్ సిందూర్ను ప్రారంభించి, తొమ్మిది పాకిస్తానీ ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసింది. 7. ఒడిశా జగన్నాథ రథయాత్ర: ఒడిశాలోని పూరిలోని శ్రీ జగన్నాథ ఆలయం ప్రతి సంవత్సరం గొప్ప రథయాత్రను నిర్వహిస్తుంది. 2025లో రథయాత్ర జూన్ 27 నుండి జూలై 5 వరకు జరిగింది. ఈ కార్యక్రమంలో జగన్నాథుడు తన సోదరుడు బలభద్రుడు, సోదరి సుభద్రతో కలిసి రథంపై కూర్చుంటారు. భక్తులు దానిని లాగుతారు. మత విశ్వాసాల ప్రకారం, ఈ రథయాత్రలో పాల్గొనడం భక్తులకు మోక్షాన్ని ప్రసాదిస్తుంది. ఈ సంవత్సరం సుమారు 1.5 మిలియన్ల మంది భక్తులు పాల్గొన్నారు. దీని గొప్పతనం, భక్తి భావం నిజంగా గొప్పగా మారింది. 8. వైష్ణో దేవి ఆలయ తీర్థయాత్ర: 2025 ఆగస్టు 25న కొండచరియలు విరిగిపడటం వలన తీర్థయాత్ర భద్రత గురించి విస్తృత చర్చ జరిగింది. కొండచరియలు విరిగిపడటంతో రాళ్ళు, బండరాళ్లు విరిగి పడ్డాయి. చాలా మంది సందర్శకులు చిక్కుకున్నారు. ఈ సంఘటన తర్వాత వైష్ణో దేవి ఆలయానికి తీర్థయాత్రలు నిలిపివేయబడ్డాయి. ఈ సంఘటనలో సుమారు 34 మంది మరణించారు. 9. మహాకాళ దేవాలయ సంఘటన: ఉజ్జయిని మహాకాళ దేవాలయంలో జరిగిన ఒక సంఘటనను కొందరు దీనిని అశుభకరమైనదిగా భావిస్తారు. దీనిని భవిష్యత్తులో జరగబోయే విపత్తుతో ముడిపెడుతున్నారు. అయితే, మరికొందరు దీనిని సాధారణ సంఘటనగా చూస్తున్నారు. ఆగస్టు 18వ తేదీ సోమవారం రాత్రి 8 గంటలకు మహాకాళ దేవాలయ పూజారులు జ్యోతిర్లింగాన్ని గంజాయితో అలంకరిస్తుండగా అకస్మాత్తుగా ముసుగు విరిగి పడిపోయింది. అయితే, పూజారులు వెంటనే దానిని తిరిగి అలంకరించి హారతి ఇచ్చారు. ఈ సంఘటన మొత్తం CCTVలో రికార్డైంది. ఈ సంఘటన వార్త వ్యాపించిన వెంటనే, ప్రజలు వివిధ విషయాలను చర్చించుకోవడం ప్రారంభించారు. కొంతమంది జ్యోతిష్కులు దీనిని ఒక ప్రధాన సంఘటనకు సంకేతంగా కూడా పేర్కొంటున్నారు. ఇలాంటిది నిజంగా జరగబోతోందా? మహాకాళ దేవాలయానికి సంబంధించిన సంఘటనలు నిరంతరం ఉద్భవిస్తున్నాయి. ఇది దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా విస్తృత చర్చకు దారితీస్తుంది. 10: కాశీ విశ్వనాథ ఆలయంలో శుభప్రదమైన గుడ్లగూబ: ఈ సంఘటన ఆగస్టు 17 (సాయంత్రం), ఆగస్టు 18 (శృంగార్ ఆరతి) ఆగస్టు 19 (సప్త ఋషి ఆరతి), 2025 న జరిగింది. వారణాసిలోని కాశీ విశ్వనాథ ఆలయం శిఖరంపై తెల్ల గుడ్లగూబ మూడు రోజుల పాటు కూర్చుంది. హిందూ పురాణాలలో గుడ్లగూబను లక్ష్మీదేవి వాహనంగా భావిస్తారు. ప్రజలు ఈ సంఘటనను అత్యంత శుభప్రదమైన సంకేతంగా భావిస్తారు. ఆలయ పరిపాలన దీనిని భక్తులకు ప్రత్యేక దీవెనగా ప్రచారం చేసింది. స్థానికులు, భక్తులు దీనిని కొత్త శక్తి, శ్రేయస్సుకు చిహ్నంగా భావిస్తారు. 11. సిక్కు మతం: తొమ్మిదవ సిక్కు గురువు శ్రీ తేజ్ బహదూర్ జీ 350వ బలిదానం వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని పంజాబ్ ప్రభుత్వం అమృత్సర్, శ్రీ ఆనంద్పూర్ సాహిబ్, తల్వాండి సాబోలను పవిత్ర నగరాలుగా ప్రకటించే ముఖ్యమైన చర్య తీసుకుంది. గురు తేజ్ బహదూర్ జీ 350వ బలిదానం వార్షికోత్సవాన్ని నవంబర్ 24, 2025న జరుపుకున్నారు. ఈ పవిత్ర నగరాల కారిడార్లలో మాంసం, చేపలు, మద్యం దుకాణాలు, సిగరెట్లు, పొగాకు ఉత్పత్తులతో సహా అన్ని రకాల మత్తు పదార్థాలపై పూర్తి నిషేధం విధించబడింది. ఈ ప్రదేశాల మతపరమైన పవిత్రతను కాపాడుకోవడానికి, వాటిని ప్రపంచ స్థాయి మత పర్యాటక గమ్యస్థానాలుగా అభివృద్ధి చేయడానికి ఈ నిర్ణయం ఒక ముఖ్యమైన అడుగు. 12. రామాలయ ధ్వజారోహణం: అయోధ్యలోని శ్రీ రామ జన్మభూమి ఆలయంలో 2025 నవంబర్ 25న జరిగిన ధ్వజారోహణ కార్యక్రమం సంవత్సరంలో అతిపెద్ద, అత్యంత ప్రతిష్టాత్మకమైన, చారిత్రాత్మక, మతపరమైన కార్యక్రమాలలో ఒకటి. సంవత్సరాల నిరీక్షణ, పోరాటం తర్వాత, రాముడి జన్మస్థలంలో నిర్మించిన అద్భుతమైన ఆలయం ఎత్తైన శిఖరంపై ధర్మ ధ్వజ శాశ్వతంగా ఎగురవేయబడింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ గొప్ప, పవిత్రమైన కార్యక్రమంలో పాల్గొని ఆలయ శిఖరంపై స్వయంగా జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, ప్రముఖ సాధువులు, ఋషులు, మత నాయకులు, దేశవ్యాప్తంగా ఉన్న వివిధ అఖారాలు, వర్గాలకు చెందిన ప్రముఖులు పాల్గొన్నారు. వారు ఈ క్షణాన్ని ఆధ్యాత్మిక శక్తి, భక్తితో స్వీకరించారు.

ఒకే ఒక్కడు.. సాటిలేని సాకర్ మాంత్రికుడు.. భాగ్యనగరంలో ‘మెస్సీ’ మెరుపు!
అర్జెంటీనా స్టార్ లియోనల్ మెస్సీకి ఉన్న క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. గోల్ పోస్ట్లోకి బాల్ను పంపించే తీరు కళ్లు చెదిరే లెవెల్లో ఉంటుంది. అందుకనే అతని గేమ్స్టైల్కి వరల్డ్వైడ్గా కోట్లాది మంది ఫ్యాన్స్ ఉంటారు. ఆ రీజన్తోనే మెస్సీ ఏ టోర్నీలో ఆడినా సరే స్టేడియం ఇట్టే నిండిపోతుంది. అసలు టికెట్ సేల్స్ అయితే పదే పది నిమిషాల్లో హాట్ కేకుల్లా అమ్ముడుపోతాయి. ఎక్కడిదాకో ఎందుకు. మరికొన్ని గంటల్లో హైదరాబాద్లో ల్యాండ్ అవుతున్నారు కదా మెస్సీ. ఉప్పల్ స్టేడియంలో టికెట్ సేల్స్ మొదలయ్యాయి. మొత్తం 39వేల మంది కూర్చునే కెపాసిటీ ఉంది. ఇప్పటికే 20వేలకు పైగా టికెట్స్ అమ్ముడుపోయాయి. మిగిలినవి పాస్ల రూపంలో ఇచ్చేస్తున్నారు. అంటే.. గ్రౌండ్ హౌస్ ఫుల్. ఆ టికెట్ రేట్స్ కూడా కళ్లు చెదిరిపోతున్నాయి. అయినా సరే.. మెస్సీ నుంచి వచ్చే ఆ వైబ్రేషన్ను ఫీల్ అవడానికి కొనేస్తున్నారంతే..! మెస్సీ వస్తున్నాడు.. మెస్సీ మన ప్లేయర్లతో ఆడబోతున్నాడు. సిటీస్ అన్నీ మెస్సీ ఫ్లెక్సీలతో నిండిపోతున్నాయ్. హూ ఈజ్ మెస్సీ. వై మెస్సీ. ఏంటీ ఫీవర్. దేనికంత క్రేజ్. ఇండియా వైడ్గా ఇప్పుడిదే టాపిక్. మెయిన్గా తెలుగు రాష్ట్రాలు.. పర్టిక్యులర్లీ హైదరాబాద్లో మెస్సీ మేనియాతో పూనకాలు తెచ్చుకుంటున్నారు. లిటరల్లీ.. ఇండియన్ ఫుట్బాల్ ఫ్యాన్స్కైతే ఆ పేరే ఓ వైబ్రేషన్. మెస్సీ.. నాట్ జస్ట్ ఏ నేమ్. ఇట్స్ ఏ బ్రాండ్. ఈ ఇంట్రస్టింగ్ ఫ్యాక్ట్ వినండొకసారి. 2022 ప్రపంచకప్లో అర్జెంటీనా టీమ్ను గెలిపించాడు మెస్సీ. అది డిసెంబర్ మంత్. అంతే.. ఇక ఆ నెలలో పుట్టిన ప్రతి 70 మంది పిల్లల్లో ఒకరికి మెస్సీ పేరే పెట్టుకున్నారు. దట్ మీన్స్.. వరల్డ్ వైడ్గా ఆ పేరు ఎంతలా కమ్మేసిందో చెప్పడానికిదో ఎగ్జాంపుల్. ఇంకో ఇంట్రస్టింగ్ ఫ్యాక్ట్.. అదే వరల్డ్కప్లో మెస్సీ వేసుకున్న ఆరు జెర్సీలను వేలానికి పెట్టారు. 65 కోట్ల రూపాయలు పెట్టి కొనుక్కున్నారు వాటిని. స్పోర్ట్స్ అండ్ గేమ్స్ హిస్టరీలో ఇదో సంచలనం. అన్బీటెడ్ రికార్డ్ కూడా. దటీజ్ మెస్సీ. ప్రపంచంలో ఏ దేశంలో మెస్సీ ఫుట్బాల్ ఆడుతున్నా సరే.. ఇసుకేస్తే రాలనంత జనం స్టేడియానికి పరిగెత్తుకొస్తారు. అదీ.. మెస్సీ లెవెల్. అలాంటి దిగ్గజ ఆటగాడు.. మరికొన్ని గంటల్లో హైదరాబాద్లో అడుగుపెడుతున్నారు. ఇంతకీ.. మెస్సీ రాక వెనక పర్పస్ ఏంటి? మెస్సీ టూర్తో మనకొచ్చే ప్రాఫిట్ ఏంటి?

నేడు హైదరాబాద్కు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ!
గోట్ ఇండియాల టూర్లో భాగంగా శనివారం ప్రపంచ ఫుడ్బాల్ లెజెండ్ మెస్సీ హైదరాబాద్కు రానున్నారు. ఉప్పల్ స్టేడియంలో జరిగే ఈవెంట్లో ఆయన పాల్గొననున్నారు. అలాగే సీఎం రేవంత్ రెడ్డితో మెస్సీ ఫుడ్బాల్ మ్యాచ్ కూడా ఆడనున్నారు. అయితే ఈ కాక్రమానికి లోక్సభ ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా రానున్నట్టు తెలుస్తోంది. లోక్సభ ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ శనివారం హైదరాబాద్ రానున్నారు. ఉప్పల్ స్టేడియంలో సీఎం రేవంత్ రెడ్డి, ఫుడ్బాల్ లెజెండ్ మెస్సీ మధ్య జరగనున్న ఫుడ్ బాల్ మ్యాచ్ను ఆయన వీక్షించనున్నారు. అర్జెంటీ ప్రముఖ క్రీడాకారుడు మెస్సీని కలవనున్నారు రాహుల్ గాంధీ. మెస్సీతో సీఎం రేవంత్ ఆటను తిలకించేందుకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీని ఆహ్వానించారు. మధ్యాహ్నం ఢిల్లీ ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి సాయంత్రం 6 గంటల 15 నిమిషాలకు హైదరాబాద్ చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో గ్రీన్ ఛానల్ ద్వారా ఫలక్ నుమా ప్యాలెస్ కు విచ్చేస్తారు. అక్కడే బస చేసి రాహుల్ గాంధీ ఉప్పల్ స్టేడియంలో జరిగే మ్యాచ్ చూసేందుకు వస్తారు. రాత్రి 7 గంటల నుంచి ఎనిమిది గంటల వరకు ఇక్కడే ఉంటారు. మ్యాచ్ అనంతరం రోడ్డు మార్గం ద్వారా బయలుదేరి రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియానికి చేరుకుంటారు. అక్కడ నిర్వహిస్తున్న గోట్ ఇండియా టూర్ కార్యక్రమంలో రాహుల్ గాంధీ పాల్గొంటారు. తిరిగి రాత్రి 10:30 ఢిల్లీకి బయలుదేరి వెళతారు. ఇక నిన్న రాహుల్ గాంధీ పార్లమెంటు అనెక్స్ హాల్లో కాంగ్రెస్ ఎంపీలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఓటు చోరీపై ఢిల్లీలోనీ రామ్ లీలా మైదానంలో నిర్వహించనున్న నిరసన కార్యక్రమంపై చర్చించారు. ఓటు చోరీ జరుగుతున్న తీరు తెన్నులను ప్రజల్లోకి తీసుకెళ్లాలనీ ఎన్డీఏ సర్కారు చేపడుతున్న వ్యతిరేక విధానాలపై ఎంపీలకు రాహుల్ గాంధీ దిశనిర్దేశం చేశారు.

కెనడాలో అర్థరాత్రి కాల్పులు.. ముగ్గురు భారతీయులు అరెస్ట్!
రెండు వర్గాల మధ్య జరిగిన కాల్పుల ఘటనలో భారత్కు చెందిన ముగ్గురు ట్రక్ డ్రైవర్లు పాల్గొన్నారనే ఆరోపణలతో వారిని కెనడా పోలీసులు అరెస్ట్ చేశారు. మిస్సింగ్లో ఉన్న మరో వ్యక్తి కోసం గాలిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. వీరిపై అక్రమ ఆయుధాల వాడకం, అనధికారికంగా తుపాకీని కలిగి ఉండడం వంటి అభియోగాలు మోపినట్టు పోలీసులు తెలిపారు. ఈ కాల్పులకు సంబంధించిన వీడియోను సైతం పోలీసులు సోషల్ మీడియాలో షేర్ చేశారు. కెనడాలో రెండు ప్రత్యర్థి ట్రక్ గ్రూపుల మధ్య జరిగిన కాల్పుల్లో ముగ్గురు భారత సంతతికి చెందిన ట్రక్ డ్రైవర్లను అరెస్టు చేశారు పోలీసులు. మరో వ్యక్తి కోసం గాలిస్తున్నట్టు తెలిపారు. వివరాల్లోకి వెళ్తే.. ఈ సంఘటన అక్టోబర్ 7న రాత్రి 10:45 గంటలకు మెక్వీన్ డ్రైవ్, కాజిల్మోర్ రోడ్ ప్రాంతంలోని జరిగింది. ఒక్కసారిగా అక్కడికి వచ్చిన రెండు వేర్వేరు గ్రూపులు ఘర్షణకు దిగాయి, ఈ క్రమంలోనే రెండు గ్రూపుల మధ్య కాల్పులు కూడా జరిగాయి. ఈ కాల్పుల్లో ఒక వ్యక్తి గాయపడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను హాస్పిటల్కు తరలించారు. ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు కాల్పులకు పాల్పడిన వారిని గుర్తించేందుకు దర్యాప్తును ముమ్మరం చేశారు. సుదీర్ఘ దర్యాప్తు తర్వాత ఈ కాల్పుల్లో పాల్గొన్న ఓ గ్రూపునకు సంబంధం ఉన్న ముగ్గురు వ్యక్తులను గుర్తించారు. దీంతో నవంబర్ 20న కాలెడాన్లోని ఒక ఇంటిపై దాడి చేసి ఆ ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన అనుమానితులు ముగ్గురు భారత సంసతికి చెందిన మంజోత్ భట్టి, నవజోత్ భట్టి, అమంజోత్ భట్టిగా పోలీసులు గుర్తించారు, మరో వ్యక్తి పరారీలో ఉన్నాడని.. అతని కోసం గాలిస్తున్నట్టు పోలీసులు పేర్కొన్నారు. ఇక మంజోత్ భట్టి పై తుపాకీతో రెక్లెస్గా కాల్పులు జరిపాడనే అభియోగాలు మోపగా..నవ్జోత్, అమన్జోత్ పై వాహనంలో తుపాకీ ఉన్నట్టు తెలిసినా కూడా ప్రయాణించారనే అభియోగాలను మోపారు పోలీసులు. ఇక నాగులో వ్యక్తి పేరు ఇంకా పోలీసులు ప్రస్తావించలేదు. కానీ అతని సంబంధించిన ఒక వీడియోను పోలీసులు రిలీజ్ చేశారు. ఈ వీడియోలో నల్ల జాకెట్, బ్లూ జీన్స్, తెల్ల రన్నింగ్ షూస్ ధరించిన వ్యక్తి కోసం గాలిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.ఈ ఘటన టో ట్రక్ ఇండస్ట్రీలో ప్రత్యర్థతల నేపథ్యంలో జరిగినట్టు పోలీసులు ప్రాథమికంగా నిర్థారించారు. ఈ రెండు గ్రూపులు దక్షిణ ఆసియా సముదాయానికి చెందినవిగా పేర్కొన్నారు

బ్యాంకు కస్టమర్లకు బిగ్ అలర్ట్.. రెండు రోజుల పాటు యూపీఐ సేవలు బంద్..
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ నుంచి కీలక ప్రకటన వచ్చింది. రెండు రోజుల పాటు ఆ బ్యాంక్ యూపీఐ సేవలు బంద్ కానున్నాయి. మెయింటనెన్స్ కారణంగా రెండు రోజులు సేవలను నిలిపివేస్తున్నట్లు స్పష్టం చేసింది. ఈ మేరకు కస్టమర్లను అలర్ట్ చేస్తూ ఒక ప్రకటన జారీ చేసింది,. దేశంలోనే ప్రముఖ ప్రైవేట్ బ్యాంక్ అయిన హెచ్డీఎఫ్సీ తమ కస్టమర్లకు బిగ్ అలర్ట్ జారీ చేసింది. హెచ్డీఎఫ్సీ డిజిటల్ సేవలు అంతరాయంగా కారణంగా నిలిచిపోనున్నాయి. మొబైల్, నెట్ బ్యాంకింగ్ సేవలు అందుబాటులో ఉండవు. 13వ తేదీ కొన్ని గంటల పాటు అందుబాటులో ఉండవని హెచ్డీఎఫ్సీ ప్రకటించింది. 13వ తేదీ ఉదయం 2.30 గంటల నుంచి 6.30 గంటల వరకు మొబైల్, నెట్ బ్యాంకింగ్ సేవలు ఆగిపోతాయని వెల్లడించింది. ఇక డిసెంబర్ 21న ఉదయం 2.30 గంటల నుంచి 6.30 గంటటల వరకు నిలిచిపోనున్నాయి. మెయింటనెన్స్ కారణంగా సేవలు అందుబాటులో ఉండవని స్పష్టం చేసింది. అకౌంట్స్, డిపాజిట్, యూపీఐ, నెఫ్ట్, ఐఎమ్పీఎస్, ఆర్టీజీఎస్, ఆన్లైన్ పేమెంట్స్, ఇతర సేవల్లో అంతరాయం ఏర్పడుతుందని హెచ్డీఎఫ్సీ ఒక ప్రకటన విడుదల చేసింది. కస్టమర్లు దీనిని గమనించాల్సిందిగా సూచించింది. ఈ సమయంలో పేజెడ్ వ్యాలెట్ను నగదు బదిలీకి ఉపయోగించుకోవాలని సూచించింది. మిగిలిన రోజుల్లో యధావిధంగా పనిచేస్తాయని పేర్కొంది. ముఖ్యంగా యూపీఐ సేవలు నిలిచిపోతున్నాయి. మీరు వివిధ యాప్స్లలో లింక్ చేసుకున్న హెచ్డీఎఫ్సీ అకౌంట్ల నుంచి యూపీఐ సేవలు పొందలేరు. అలాగే హెచ్డీఎఫ్సీ జారీ చేసి రూపే కార్డులతో కూడా యూపీఐ సేవలు పొందలేరు.

పోలీసుల అదుపులో దువ్వాడ శ్రీనివాస్ మాధురి.
మద్యం మత్తు.. బర్త్ డే పార్టీ.. మొయినాబాద్ The Pendent ఫామ్ హౌస్ పై రాజేంద్రనగర్ ఎస్ఓటి పోలీసులు దాడులు పోలీసుల అదుపులో దువ్వాడ శ్రీనివాస్ మాధురి... బర్త్డే పార్టీలో మద్యం బాటిళ్లు స్వాధీనం.... అనుమతి లేకుండా మద్యం సేవించి బర్త్ డే పార్టీ నిర్వహించుకున్న దువ్వాడ శ్రీనివాస్ భార్య మాధురి పుట్టినరోజు సందర్భంగా గురువారం రాత్రి ఫామ్ హౌస్ లో వైసిపి నాయకులతో పార్టీ నిర్వహించారు... దువ్వాడ శ్రీనివాస్ ఆయన ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో శాసన మండలి సభ్యుడిగా పనిచేస్తున్నారు. ఆయన YSR పార్టీకి చెందినవారు. శ్రీనివాస్ వివాహం చేసుకున్నాడు, 2024లో తన కుటుంబాన్ని విడిచిపెట్టి దువ్వాడ మాధురితో డిసెంబర్ 12వ తేదీన మాధురి బర్త్డే వేడుకలను ఘనంగా చేయాలని ఆమోది బుక్ చేసుకుని వచ్చారు. ఈ బర్త్డే పార్టీలో మద్యం బాటిళ్లు ఒక్క వంటి ఇతరత్రా ఇతర ధర సంబంధించిన మత్తు పదార్థాలు కూడా ఉన్నాయని సమాచారం... పోలీసులు, ఎస్ఓటీ పోలీసులు సంయుక్తంగా బర్త్డే జరుపుకొంటున్న ఫామ్ హౌస్పై దాడులు నిర్వహించి.. పార్టీని భగ్నం చేశారు. వారి నుంచి భారీగా మద్యం స్వాధీనం చేసుకున్నారు. స్థానిక పోలీసులకు, ఎస్ఓటీ పోలీసులకు అందిన పక్కా సమాచారంతో ఫామ్ హౌస్పై సంయుక్తంగా దాడి చేసి బర్త్ డే పార్టీని భగ్నం చేశారు.

లేడీ డాన్ అరుణపై పీడీ యాక్ట్.. ఆమె నేరాల చిట్ట చూసి నోరెళ్లబెట్టిన పోలీసులు!
రౌడీ షీటర్ శ్రీకాంత్ ప్రియురాలు.. నెల్లూరుజిల్లాకు చెందిన లేడీడాన్ అరుణను ఎట్టకేలకు పోలీసు పట్టుకున్నారు. ఆమెపై పీడీ (ప్రివెంటివ్ డిటెన్షన్) యాక్ట్ నమోదు చేశారు. రౌడీషీటర్ శ్రీకాంత్ పెరోల్తో పాటు, పలు సెటిల్మెంట్ దందాల్లో అరుణ పాల్గొన్నట్టు గుర్తించిన పోలీసులు.. ఆమె నేరాల చిట్టాను బయటపెట్టారు. దీంతో ప్రస్తుతం నెల్లూరు కేంద్ర కారాగారంలో ఉన్న అరుణను కడప సెంట్రల్ జైలుకు తరలించారు పోలీసులు. లేడీ డాన్ అరుణ వ్యవహారంపై అనుమానం రావడంతో లోతైన విచారణ జరిపారు పోలీసులు. ఆమె ప్రముఖ రాజకీయ పార్టీల నేతలు, పోలీసు ఉన్నతాధికారులతో సన్నిహితంగా ఉంటూ వారినే బ్లాక్ మెయిల్ చేసే స్థాయికి ఎదిగినట్టు గుర్తించారు. ఇవే కాకుండా పలు సెటిల్మెంట్ వ్యవహారాల్లో కూడా ఈమె పాల్గొన్నట్టు గుర్తించారు. రౌడీ షీటర్ శ్రీకాంత్ కు పెరోల్ ఇప్పించడం.. బయటకు వచ్చిన సందర్భంలో సన్నిహితంగా ఉన్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పెరోల్ వచ్చిన నాలుగు రోజుల్లోనే రద్దు చేసి తిరిగి జైలుకు పంపారు. ఈ వ్యవహారాన్ని సీరియస్గా తీసుకున్న పోలీసులు.. అరుణను అరెస్ట్ చేసి లోతుగా విచారణ జరపడంతో షాకింగ్ విషయాలు వెలుగు చూశాయి. సూళ్లూరుపేట కేంద్రంగా అరుణ పలు సెటిల్మెంట్కు పాల్పడినట్టు గుర్తించారు. వెంకటగిరికి చెందిన ఓ వ్యక్తిని గంజాయి, వ్యభిచార గృహాలు నడపాలని డిమాండ్ చేసినట్లు బాధితుడి ఫిర్యాదు ద్వారా తెలుసుకున్నారు. సూళ్లూరుపేట మాజీ ఎమ్మెల్యేతో అరుణ సన్నిహితంగా మెలిగినట్లు కొన్ని వీడియోలు కూడా వైరల్ అయినట్టు పోలీసులు కనిపెట్టారని తెలుస్తోంది. అయితే రౌడీ షీటర్లు, జైలు ఉన్నతాధికారులు, రాజకీయ నేతలకు తరచుగా ఆమె ఫోన్ చేసి మాట్లాడినట్లు కాల్ డేటా ఆధారంగా పోలీసులు గుర్తించారు. దీంతో అరుణ పై పీడీ యాక్ట్ నమోదు చేశారు. అనంతరం ఆమెను నెల్లూరు జైలు నుంచి కడప సెంట్రల్ జైలుకు తరలించారు. రిపీటెడ్గా నేరాలు చేస్తున్న రౌడీ షీటర్ల పై కఠినంగా వ్యవహరిస్తున్న SP అజిత.. కోవూరు, నవాబ్ పేట, వేదయాపాలెం పీఎస్ లలో ఇప్పటికే అరుణ పై కేసులు నమోదు కాగా పిడి యాక్ట్ ప్రయోగించారు. అరుణ బయటికి వస్తె నేరాల్లో ఇన్వాల్ అయ్యే చాన్స్ ఉండటంతో ఆమె పై పీడియాక్ట్ ప్రయోగం చేసినట్లు తెలుస్తోంది. రెండేళ్ల కాలంలో ఐదు కంటే ఎక్కువ నేరాల పాల్పడితే వారిపై పీడియాక్ట్ పెట్టే అవకాశం ఉంటుంది. పీడియాక్ట్ ప్రయోగిస్తే ఏడాది పాటు నో బెయిల్, ఎవరిని కలిసేందుకు అనుమతి ఉండదు. బెయిల్ కావాలంటే హైకోర్టుకు వెళ్లాల్సిందే. ములాఖాత్ కోసం హోం ప్రిన్సిపల్ సెక్రటరీ అనుమతి తప్పనిసరి కావడంతో ఆమె నేరాలకు బ్రేక్ వేసే అవకాశం ఉన్నట్లు పోలీసు అధికారులు చెబుతున్నారు

కొబ్బరి రైతులకు గుడ్న్యూస్ .. మద్దతు ధర పెంపునకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. ధర ఎంతంటే?
కొబ్బరి రైతులకు కేంద్ర ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది. 2026 సీజన్కు కొబ్బరి కనీస మద్దతు ధర పెంపునకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ కొబ్బరి కనీస మద్దతు ధర పెంచుతూ నిర్ణయం తీసుకుంది. గత కొన్ని రోజులుగా కనీస మద్దతు ధర లేక తీవ్రంగా నష్టపోతున్న కొబ్బరి రైతులకు కేంద్రం పండగ లాంటి వార్తను చెప్పింది. కొత్త సంవత్సరానికి ముందే కొనసీమ రైతుల కళ్లలో ఆనందాన్ని తెచ్చింది. 2026 సీజన్కు కొబ్బరి కనీస మద్దతు ధర పెంపునకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. తాజాగా ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ కొబ్బరి కనీస మద్దతు ధర పెంచుతూ నిర్ణయం తీసుకుంది. కొబ్బరి ఎంఎస్పీని క్వింటాలుకు రూ.12,027గా, బాల్ కొబ్బరికి రూ.12,500గా ప్రభుత్వం నిర్ణయించింది. గత సీజన్ కంటే మిల్లింగ్ కొబ్బరిపై క్వింటాలుకు రూ.445, బాల్ కొబ్బరిపై క్వింటాలుకు రూ.400 పెంచింది. 2014లో క్వింటాల్ మిల్లింగ్ కొబ్బరి ధర రూ.5,250 గా ఉండగా.. బాల్ కొబ్బరి ధర రూ.5,500 గా ఉంది. గడిచిన 11 ఏళ్లుగా కొబ్బరి ధరల్లో వచ్చిన మార్పులు చూసుకుంటే.. 2026 మార్కెటింగ్ సీజన్ నాటికి మల్లింగ్ కొబ్బరిపై 129 శాతం, బాల్ కొబ్బరిపై 127 శాతం వృద్ధి ఉంది. కొబ్బరి రైతులకు లాభదాయక ధరలను అందించడం కోసం పంటల కనీస మద్దతు ధరను సగటు ఉత్పత్తి వ్యయం కంటే కనీసం 1.5 రెట్ల స్థాయిలో నిర్ణయించనున్నట్లు ప్రభుత్వం 2018-19 కేంద్ర బడ్జెట్లో ప్రకటించింది. దానికి అనుగుణంగా కొబ్బరి ఉత్పత్తిని పెంచడానికి రైతులను ప్రోత్సహించేలా కేంద్రం ఎప్పటికప్పుడు కొబ్బరి మద్దతు ధర పెంచుతుంది. కొబ్బరి సాగుదారులకు మెరుగైన లాభదాయక రాబడిని నిర్దారించడమే కాకుండా. దేశీయంగా, అంతర్జాతీయంగా కొబ్బరి ఉత్పత్తులకు పెరుగుతున్న డిమాండ్ను తీర్చడానికి సరిపడా కొబ్బరి ఉత్పత్తిని విస్తరించేలా రైతులను ప్రోత్సహిస్తుంది. ప్రస్తుతం దేశంలో ధర మద్దతు పథకం కింద కొబ్బరి సేకరణ కోసం సెంట్రల్ నోడల్ ఏజెన్సీలుగా నేషనల్ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, నేషనల్ కోఆపరేటివ్ కన్స్యూమర్స్ ఫెడరేషన్లు పనిచేస్తున్నాయి.

కేటీఆర్ తో భేటీ అయిన అఖిలేష్ యాదవ్
నంది నగర్ నివాసంలో కేటీఆర్ , పార్టీ నేతలతో ముగిసిన సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు,ఎంపీ అఖిలేష్ యాదవ్ సమావేశం అంతకు ముందు ఆయనకు స్వాగతం పలికిన మాజీ మంత్రి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్,రాజ్యసభ ఎంపీ వడ్డీరాజు రవిచంద్ర ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ అనంతరం కేటీఆర్ తో భేటీ అయిన అఖిలేష్ యాదవ్ పాల్గొన్న మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు,పలువురు బిఆర్ ఎస్ ఎమ్మెల్యేలు తాజా రాజకీయ అంశాలపై చర్చ.

తెలంగాణ రాష్ట్ర సాధనలో కేసీఆర్ ఒక చరిత్ర - శ్రీనివాస్ యాదవ్
తెలంగాణ రాష్ట్ర సాధనలో కేసీఆర్ ఒక చరిత్ర అని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మంగళవారం నిమ్స్ హాస్పిటల్ లో ని పేషేంట్లకు తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో పండ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1969 లోనే తెలంగాణ ఉద్యమం ప్రారంభమైనప్పటికీ, నాటి నాయకులు కేంద్రప్రభుత్వం కు తలొగ్గి ఉద్యమాన్ని నీరుగార్చేవారని పేర్కొన్నారు. 400 మంది మరణించిన విషయాన్ని గుర్తు చేశారు. 2001 సంవత్సరంలో కేసీఆర్ నాయకత్వం లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని ఏర్పాటు చేసి సాగర హారం, సకల జనుల సమ్మె, వంట వార్పు వంటి కార్యక్రమాలతో సుదీర్ఘ కాలం పోరాటం చేసి ఉద్యోగులు, కార్మికులు, విద్యార్థులు అన్ని వర్గాలను కేసీఆర్ ఐక్యం చేశారని, కేంద్ర ప్రభుత్వం పై ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నించారని చెప్పారు. దేశ స్వాతంత్య్రం కోసం మహాత్మా గాంధీ అనుసరించిన అహింసా మార్గాన్నే తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కేసీఆర్ అనుసరించిన అహింసా మార్గంలో పోరాడారని తెలిపారు. తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో అనే నినాదంతో కేసీఆర్ నవంబర్ 29, 2009 న ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారని చెప్పారు. కేసీఆర్ దీక్ష తెలంగాణ జాతిని మొత్తం ఏకం చేసిందని అన్నారు. 11 రోజుల కేసీఆర్ దీక్షకు నాటి కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు డిసెంబర్ 9 న ప్రకటన చేసిందని తెలిపారు. చరిత్రలో నిలిచిపోయే ఈరోజు ను విజయ్ దివస్ గా ఘనంగా జరుపుకుంటున్నట్లు వివరించారు. పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని 10 సంవత్సరాల కేసీఆర్ పాలనలో ఎంతో అభివృద్ధి చేసుకున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు ముఠా గోపాల్, కాలేరు వెంకటేష్, సికింద్రాబాద్ పార్లమెంట్ ఇంచార్జి తలసాని సాయి కిరణ్ యాదవ్, నాయకులు మాగంటి సునీత, విప్లవ్ కుమార్, మేడె రాజీవ్ సాగర్, మన్నె గోవర్ధన్ రెడ్డి, పలువురు కార్పొరేటర్ లు, మాజీ కార్పొరేటర్ లు, బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

బ్రేకింగ్ న్యూస్
ఇప్పుడే జరిగిన సంఘటన,, ముషీరాబాద్ డివిజన్ బాపూజీ నగర్ బస్తీలో ఇంట్లో చొరబడి 17 ఏళ్ళ పవిత్ర అనే అమ్మాయిని అతి దారుణంగా కత్తితో పొడిచి చంపేసి పారిపోయిన గుర్తు తెలియని వ్యక్తి... బొద్ధ నగర్, వారాసిగూడ SHO, మరి వారి పోలీసుల సిబ్బంది దర్యాప్తు చేస్తున్నారు.. వివరాలు తెలియాల్సి ఉంది

ఎల్లమ్మ గూడెంలో ఉద్రిక్తత..!
ల్లమ్మ గూడెం నుండే నీ పతనం మొదలైంది..! బిడ్డ నీ తొత్తుల సంగతి చేస్తాం, బీసీ బిడ్డకు అండగా మాదిగ బిడ్డ..! పవన్ కళ్యాణ్ పై స్పందించే టైం ఉందా..! పృథ్వీరాజ్ సంచలన వ్యాఖ్యలు

నేడు, రేపు తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్..
నేడు, రేపు తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్.. ఫ్యూచర్ సిటీలో రెండు రోజుల పాటు జరగనున్న గ్లోబల్ సమ్మిట్.. పెట్టుబడుల ఆకర్షణ, యువతకు ఉపాధి కల్పనే లక్ష్యం.. 44 దేశాల నుంచి 154 మంది అతిథుల రాక.. ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ కంపెనీల నుంచి ప్రతినిధి బృందాలు.. ఇవాళ మధ్యాహ్నం 1.30 గంటలకు సమ్మిట్ ప్రారంభం.. ముఖ్య అతిథిగా హాజరుకానున్న గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ.. 2.30కి సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగం.. వివిధ అంశాలపై 27 సెషన్లలో చర్చలు

ఆర్టిఏ ఆఫీస్ వద్ద మహాధర్నా
ఆర్టిఏ ఆఫీస్ వద్ద మహాధర్నా ఖైరతాబాద్ ఆర్టీవో కార్యాలయంలో ఆటో యూనియన్ లన్ని కలిసి మహా ధర్నా నిర్వహిస్తున్న తరుణంలో పంజాగుట్ట నుంచి ఖైరతాబాద్ వరకు ట్రాఫిక్ జామ్