
Author: Pavan
Last updated at: Jul 23, 2026, 07:50 AM
విద్యుత్ కోతలపై రైతుల రాస్తారోకో నల్లగొండ జిల్లా ఇండ్లూరులో విద్యుత్ కోతలకు నిరసనగా రైతులు రాస్తారోకో చేపట్టారు. అసమయ విద్యుత్ కోతలతో నారుమడ్లు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి కోమటిరెడ్డి జోక్యం చేసుకుని సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేశారు. రోజుకు 17 గంటల విద్యుత్ ఇస్తున్నామని, సాంకేతిక సమస్యల సమయంలో మాత్రమే కోతలు ఉంటాయని ఏఈ తెలిపారు.