
కూటమి పాలనకు రెండేళ్లు.. ప్రజలకు సీఎం కృతజ్ఞతలు
Author: Pavan
Last updated at: Jun 4, 2026, 07:50 AM
ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తైన సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. 2024 జూన్ 4 రాష్ట్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచే రోజు అని పేర్కొన్నారు. ప్రజలు ఇచ్చిన తీర్పు అధికారం కోసం కాదని, రాష్ట్ర పునర్నిర్మాణ బాధ్యత అని అన్నారు. సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనతో ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టేలా పాలన కొనసాగిస్తున్నామని తెలిపారు.